
పశ్చిమ బెంగాల్లో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ వర్గానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. రెజీనగర్ ఉప ఎన్నికలో టీఎంసీ అభ్యర్థిగా ప్రకటించిన రబియుల్ ఆలం చౌదరి పోటీ నుంచి తప్పుకున్నారు. రెజీనగర్ ఉప ఎన్నికకు మమతా బెనర్జీ వర్గం తరఫున రబియుల్ ఆలం చౌదరిని సెప్టెంబర్ 13న అభ్యర్థిగా ప్రకటించారు.
అయితే ఎన్నికల గుర్తుకు సంబంధించిన వివాదం నేపథ్యంలో తాను పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. కొత్త ఎన్నికల గుర్తును ఓటర్లకు పరిచయం చేసేందుకు సమయం సరిపోదని అలాగే పార్టీ కార్యకర్తలను క్షేత్రస్థాయిలో సమర్థంగా సమీకరించేందుకు కూడా తగిన వ్యవధి లేదని ఆయన పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం మమతా బెనర్జీ వర్గం రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గం మధ్య తృణమూల్ కాంగ్రెస్ పేరు ఎన్నికల గుర్తుపై వివాదం కొనసాగుతోంది. ఈ అంశంపై ఎన్నికల సంఘం విచారణ జరుపుతోంది. రెజీనగర్ పరిణామానికి కొద్దికాలం ముందు నందిగ్రామ్ ఉప ఎన్నికలో మమతా బెనర్జీ వర్గం తరఫున ప్రకటించిన సంచిత కూడా పోటీ నుంచి తప్పుకున్నారు.
నందిగ్రామ్, రెజీనగర్ రెండు నియోజకవర్గాల్లోనూ అక్టోబర్ 6న పోలింగ్ జరగనుంది. దీంతో ఈ రెండు నియోజకవర్గాలకు మమతా బెనర్జీ వర్గం ప్రకటించిన అభ్యర్థులు ఇద్దరూ ఎన్నికల బరి నుంచి వైదొలిగినట్లైంది.
