
DNews:10 Dec: కామారెడ్డి జిల్లాలో పాఠశాల విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో బోల్తాపడి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 14 మంది విద్యార్థులు గాయపడ్డారు.
కామారెడ్డి జిల్లా, జుక్కల్ మండలం.సావర్గావ్ గ్రామం నుంచి ఖండే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో బోల్తాపడింది.పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ప్రణవ్ (15) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.మరో 14 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
