
D Spiritual: Jan 28: మేడారం జాతరకు తరలివచ్చే భక్తులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ద్వారా నాలుగు వేల బస్సులు నడుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. మహిళలు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించామని, బస్సులు నేరుగా అమ్మవారి గద్దెల ప్రాంగణం వరకు భక్తులను చేరుస్తాయని తెలిపారు.
భక్తులకు అవసరమైన తాగునీరు, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. మేడారంలో 50 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్ స్టేషన్ను సిద్ధం చేశామని చెప్పారు. అలాగే 9 కిలోమీటర్ల పొడవున 50 క్యూలైన్లు ఏర్పాటు చేసి, ఒకేసారి 20 వేల మంది భక్తులు నిలిచేలా సదుపాయాలు కల్పించినట్లు వివరించారు.
