
DNews: Nov 24: నర్సింహులపేటలో సోమవారం రైతు వేదికలో మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ, మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మహిళల ఐక్యతకు ప్రతీకగా నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తున్నామని, మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ, అవసరమైన వైద్య సేవలను అందిస్తున్నామని చెప్పారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతున్నామని, మహిళలు అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ రాముగౌడ్, తొర్రూర్ RDO గణేష్, DRDA మధుసూదనరాజు, APM రాములు, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కడుదుల జ్యోతి పాల్గొన్నారు.
