DNews:12 NOV:కొల్లాపూర్ (నాగర్‌కర్నూల్) అడవులను నరికడమే కాకుండా, అడ్డుకునేందుకు వెళ్లిన అటవీ సిబ్బందిపై దాడి చేసిన ఘటనపై ఫారెస్ట్‌ అధికారులు సీరియస్‌గా స్పందించారు. ఈ నేపథ్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఫారెస్ట్‌ రేంజ్ పరిధిలో ఆక్రమణదారులు చదును చేసిన 15 ఎకరాల ప్రాంతంలో మళ్లీ మొక్కలు నాటుతూ అధికారులు గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

వివరాల ప్రకారం — కొల్లాపూర్‌ రేంజ్‌లోని కంపార్ట్‌మెంట్‌ 425లో ఇటీవల ఆక్రమణదారులు వేలాది చెట్లను నరికి సుమారు 15 ఎకరాల అటవీ భూమిని చదును చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్‌ అధికారులు అక్కడకు చేరుకున్నప్పుడు ఆక్రమణదారులు వారిపై దాడికి పాల్పడ్డారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా, అడవుల పునరుద్ధరణకు అధికారులు ముందుకొచ్చారు.

డీఎఫ్‌వో రోహిత్‌ గోపిడి సారథ్యంలో అమ్రాబాద్‌ మరియు కొల్లాపూర్‌ రేంజ్‌లకు చెందిన దాదాపు 500 మంది అటవీ సిబ్బంది మంగళవారం భారీ ఎత్తున మొక్కల నాటకం చేపట్టారు. చెట్లు నరికిన అదే ప్రాంతంలో కొత్త మొక్కలను నాటుతూ ‘అడవులను కాపాడతాం’ అనే సంకేతం ఇచ్చారు.

ఈ సందర్భంగా డీఎఫ్‌వో రోహిత్‌ గోపిడి మాట్లాడుతూ —
“అటవీ భూములను ఆక్రమించేందుకు లేదా ఫారెస్ట్‌ సిబ్బందిపై దాడి చేసేందుకు ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అడవులను రక్షించడం మా బాధ్యత, దానిలో ఎటువంటి రాజీ ఉండదు” అని హెచ్చరించారు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana