
DSports 4 Dec:రాయ్పూర్/న్యూ ఢిల్లీ: దక్షిణాఫ్రికాతో త్వరలో జరగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) బుధవారం (డిసెంబర్ 3, 2025) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో గాయం కారణంగా చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మరియు యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ తిరిగి రావడం ప్రధానాంశంగా నిలిచింది.
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో బరిలోకి దిగనున్న ఈ జట్టుకు శుభ్మన్ గిల్ను వైస్-కెప్టెన్గా ఎంపిక చేశారు.
