
DNews:NOV 12:హైదరాబాద్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) వివాదంలో చిక్కుకున్నారు. మంగళవారం జరిగిన పోలింగ్ సందర్భంగా ఆయన హల్చల్ చేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే — జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా యూసుఫ్గూడ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఓ ఫంక్షన్ హాల్లోకి అనుమతి లేకుండా దూసుకెళ్లారని ఫిర్యాదు అందింది. పోలీసులు ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆయన సూచనలు పట్టించుకోలేదని స్థానిక పోలీసులు తెలిపారు.
ఈ సంఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి, శాంతి భద్రతలను భంగం కలిగించేలా ప్రవర్తించారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పాడి కౌశిక్ రెడ్డి గతంలో కూడా పలు వివాదాల నేపథ్యంలో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఆయన ప్రవర్తనపై అధికారులు నివేదిక సిద్ధం చేసి ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు సమాచారం.
