D-News: భారత్ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో భారీ పురోగతి సాధిస్తోంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ.4.24 లక్షల కోట్లకు చేరాయి. 2014-15లో ఇవి సుమారు రూ.38,000 కోట్లుగా ఉండేవి. అంటే పదేళ్లలో ఎగుమతులు 11 రెట్లకు పైగా పెరిగాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు ప్రస్తుతం భారత్‌లోని మూడో అతిపెద్ద ఎగుమతి విభాగంగా మారాయి. 2025లో ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల విలువ 47.96 బిలియన్ డాలర్లకు చేరినట్లు ప్రభుత్వం తెలిపింది.

మొబైల్ ఫోన్ తయారీలో భారత్ దూసుకెళ్తోంది

మొబైల్ ఫోన్ తయారీలో భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద తయారీ దేశంగా ఎదిగింది. 2014-15లో దేశంలో మొబైల్ ఫోన్ ఉత్పత్తి విలువ రూ.18,000 కోట్లుగా ఉండగా, 2025-26 నాటికి అది రూ.6.27 లక్షల కోట్లకు చేరింది. మొబైల్ ఫోన్ ఎగుమతులు కూడా భారీగా పెరిగాయి. 2014-15లో రూ.1,500 కోట్లుగా ఉన్న ఎగుమతులు 2025-26 నాటికి రూ.2.59 లక్షల కోట్లకు చేరాయి. అంటే సుమారు 165 రెట్లు వృద్ధి నమోదైంది. ఈ రంగం ద్వారా దేశంలో 12 లక్షల ఉద్యోగాలు ఏర్పడ్డాయి. ప్రత్యేకంగా మొబైల్ తయారీ రంగంలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది. అక్కడి మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 70 శాతం మంది మహిళలే ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. మొత్తం ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థలో మహిళల వాటా కూడా దాదాపు 30 శాతానికి చేరువైంది.

డిజిటల్ రంగంలోనూ భారీ మార్పులు

దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు జీడీపీలో 14 శాతం వరకు వాటా కలిగి ఉంది. PLI పథకం, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్, ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ వంటి పథకాలు దేశీయ తయారీని పెంచడంలో సహాయపడ్డాయని ప్రభుత్వం తెలిపింది. ఇంటర్నెట్ వినియోగం కూడా భారీగా పెరిగింది. 2014లో 25.15 కోట్లుగా ఉన్న ఇంటర్నెట్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2026 మార్చి నాటికి 109.2 కోట్లకు పైగా చేరింది. మొబైల్ డేటా ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. 2014లో ఒక జీబీ డేటాకు సగటున రూ.308 ఖర్చు కాగా, 2026లో అది రూ.7.51కు తగ్గింది. దీంతో దేశంలో డిజిటల్ సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయి. మొబైల్ ఇంటర్నెట్ వేగం కూడా పెరిగింది. 2022 మార్చిలో సగటు డౌన్‌లోడ్ స్పీడ్ 13.67 Mbpsగా ఉండగా, 2025 డిసెంబర్ నాటికి 132 Mbpsకు చేరింది.

5G, గ్రామీణ కనెక్టివిటీలోనూ పురోగతి

దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 99.9 శాతం జిల్లాలకు 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. 2026 జూన్ నాటికి దేశంలో 5.63 లక్షల 5G బేస్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ కనెక్టివిటీ పెరిగింది. BSNLతో పాటు ఇతర టెలికాం సంస్థల సేవల ద్వారా 6.31 లక్షల గ్రామాలకు 4G నెట్‌వర్క్ చేరింది. ఈ గణాంకాలు భారత్ ఎలక్ట్రానిక్స్ తయారీ, మొబైల్ ఎగుమతులు, డిజిటల్ కనెక్టివిటీ రంగాల్లో వేగంగా ఎదుగుతున్నట్లు సూచిస్తున్నాయి.:::

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana