
DSports 14Feb 2026:అండర్-19 ప్రపంచకప్లో తన విధ్వంసకర బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన టీమిండియా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు పరీక్షల బరిలోకి దిగుతున్నాడు. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న సీబీఎస్ఈ (CBSE) పదో తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యేందుకు వైభవ్ సిద్ధమయ్యాడు.
- ఫిబ్రవరి 17, 2026 నుంచి మార్చి 11 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. వైభవ్ బిహార్లోని సమస్తిపుర్ జిల్లాలో ఉన్న పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్లో పరీక్ష రాయనున్నాడు. వైభవ్కు సంబంధించిన అడ్మిట్ కార్డ్ (హాల్ టికెట్) ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
- వైభవ్ అంతర్జాతీయ క్రికెటర్ అయినప్పటికీ, పరీక్షా కేంద్రంలో అతనికి ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించబోమని పాఠశాల ప్రిన్సిపల్ నీల్ కిశోర్ సిన్హా స్పష్టం చేశారు. “ఇది క్రికెట్ పిచ్ కాదు, అకాడెమిక్ పిచ్. పరీక్షా హాలులోకి అడుగుపెట్టిన తర్వాత వైభవ్ అందరిలాగే ఒక సాధారణ విద్యార్థి. అతనికి ఎటువంటి వీఐపీ ప్రోటోకాల్ ఉండదు” అని ఆయన మీడియాకు తెలిపారు. అయితే, భద్రతా దృష్ట్యా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
