
DSports 12 Nov:రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-డీలో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్తో జరిగిన మ్యాచ్ను ఆతిథ్య హైదరాబాద్ డ్రాగా ముగించింది.తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో హైదరాబాద్, రాజస్థాన్ ముందు 340 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.340 పరుగుల ఛేదనలో ఆఖరి రోజైన మంగళవారం రాజస్థాన్ బ్యాటర్లు దీటుగా పోరాడారు. సల్మాన్ ఖాన్ (79), సచిన్ యాదవ్ (44), కెప్టెన్ మహిపాల్ లోమ్రోర్ (40) రాణించారు.ట ముగిసే సమయానికి రాజస్థాన్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 207 పరుగులు చేసింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో రాణించిన రాహుల్ రాదేశ్కు లభించింది.
ఈ డ్రాతో హైదరాబాద్ జట్టు మొత్తం 13 పాయింట్లతో గ్రూప్-డీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ముంబై (17), జమ్మూ కశ్మీర్ (14) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
