DNews:24 Nov:హైదరాబాద్‌ తెలంగాణ ముఖ్యమంత్రి (సీఎం) రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ఆయనకు ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. కొడంగల్ మండల కేంద్రం నుంచి కీలకమైన విద్యా సంస్థలను దుద్యాల మండలానికి తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాలు సోమవారం స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి. దీంతో నియోజకవర్గ కేంద్రంలో అన్ని వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి, విద్యా సంస్థలు సైతం తెరచుకోలేదు.

ప్రభుత్వం తరలించాలని నిర్ణయించిన విద్యా సంస్థలలో ముఖ్యంగా మెడికల్ కళాశాల, వెటర్నరీ కళాశాల, నర్సింగ్ కళాశాల మరియు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కళాశాలలు ఉన్నాయి. ఈ తరలింపును వ్యతిరేకిస్తూ కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) బంద్‌కు పిలుపునిచ్చింది. అంతేకాకుండా, కొడంగల్‌ మండలంలో ఈరోజు జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బహిరంగ సభను బహిష్కరించాలని ఐక్య కార్యాచరణ కమిటీ నిర్ణయించింది. ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేస్తూ సీఎం పర్యటనను బహిష్కరించడానికి సిద్ధమవ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana