DNews:27 Nov:పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి ఫైర్: “తెలంగాణపై దిష్ట తాకడం నిజమే”ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల పచ్చదనం మరియు రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతకు దారి తీసాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గోదావరి జిల్లాల పచ్చదనం వల్లే రాష్ట్ర విభజన జరిగిందన్నారు. అదేవిధంగా, తెలంగాణ నాయకుల దిష్టి తాకడం వల్ల గోదావరి జిల్లాల్లో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. పవన్ కళ్యాణ్ మాటలను “తెలివితక్కువ వ్యాఖ్యలు”గా విమర్శిస్తూ, “అసలు మా దిష్టి వాళ్లకి తాకడం కాదు, ఇన్నేళ్లు వాళ్ల దిష్టి మా తెలంగాణకు తాకింది” అని కౌంటర్ ఇచ్చారు.

అదనంగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిపై పరోక్షంగా ప్రస్తావిస్తూ, “మెదడు వాడకుండా, నోటికొచ్చినట్లు మాట్లాడే వాళ్లు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారని” ఎద్దేవా చేశారు.ఈ మాటలు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర వాదనలకు దారి తీసాయి. రాజకీయ వర్గాలు ఈ అంశంపై తీవ్ర చర్చలు జరుపుతున్నాయి.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana