
DNews:02 Dec:గద్వాల, (జోగుళాంబ గద్వాల జిల్లా): జిల్లా కేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో (ST Hostel, Gadwal) ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తినడం వల్ల 13 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వరుసగా ప్రభుత్వ హాస్టళ్లలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సంఘటన వివరాలు గద్వాలలోని ఎస్టీ హాస్టల్.కలుషిత ఆహారం తిన్న కారణంగా సుమారు 13 మంది విద్యార్థులు వాంతులు, కడుపునొప్పి, విరోచనాలతో బాధపడ్డారు.అస్వస్థతకు గురైన విద్యార్థులను హుటాహుటిన హాస్టల్ సిబ్బంది గద్వాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు.ప్రస్తుత పరిస్థితి: చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మిగిలిన వారికి వైద్య సేవలు అందిస్తున్నారు.
ప్రభుత్వ హాస్టళ్లలో తరచుగా కలుషిత ఆహారం కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నప్పటికీ, నాణ్యమైన ఆహారం అందించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నా, అధికారులు అప్పటి చర్యలకే పరిమితమై, దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెట్టడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఈ ఘటనపై అధికారులు తక్షణమే స్పందించి, హాస్టల్లో ఆహారం నాణ్యతను పరీక్షించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
