
DNews:14 NOV:జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ హోరాహోరిగా కొనసాగుతోంది. మొత్తం పది రౌండ్లుగా జరగనున్న ఈ కౌంటింగ్లో ప్రతి రౌండ్కు సుమారు 40 నిమిషాల సమయం పడుతోంది. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో 186 మంది సిబ్బంది పాల్గొనగా, ఎన్నికల సంఘం ప్రత్యేక అనుమతితో 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ వాతావరణం ఉద్విగ్నంగా ఉన్నప్పటికీ, అధికారులు పటిష్ట బందోబస్తు మధ్య ప్రక్రియను కొనసాగిస్తున్నారు.
కౌంటింగ్ ప్రారంభంలోనే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. మొత్తం 101 పోస్టల్ ఓట్లు పోలగా, కాంగ్రెస్ 39 ఓట్లతో స్వల్ప ఆధిక్యం సాధించింది. బీఆర్ఎస్కు 36 ఓట్లు, బీజేపీకి 10 ఓట్లు వచ్చినాయి. పోస్టల్ ఓట్ల దశలోనే కాంగ్రెస్ ఆధిక్యం కనబడటంతో ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.
తదుపరి రౌండ్లలోనూ కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని కొనసాగించింది. తొలి రౌండ్లో కాంగ్రెస్కు 44 ఓట్ల ఆధిక్యం రావడంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. రెండో, మూడో, నాలుగో రౌండ్లలోనూ కాంగ్రెస్ ముందంజలోనే సాగుతోంది. నాలుగో రౌండ్ పూర్తి అయ్యే సరికి కాంగ్రెస్కు 9,567 ఓట్లు రావగా, బీఆర్ఎస్కు 6,020 ఓట్లు మాత్రమే లభించాయి. దీంతో కాంగ్రెస్ ఆధిక్యం 10 వేల ఓట్లకు చేరువైంది.
సమగ్రంగా చూస్తే, ఇప్పటి వరకు జరిగిన లెక్కింపులో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. అయితే ఇంకా రౌండ్లు మిగిలి ఉండడంతో చివరి వరకు ఆసక్తి ఏమాత్రం తగ్గనట్టే ఉంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం ఏ దిశలో సాగుతుందన్న ఆసక్తి రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ కనిపిస్తోంది.JubileeHillsByElection
