
DSports 23Mar 2026:ఇస్లామాబాద్: పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) ప్రారంభానికి కేవలం మూడు రోజుల ముందు షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. పాక్కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘జమాత్-ఉల్-అహ్రార్’ (తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ అనుబంధ సంస్థ) విదేశీ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేసింది.
- ఆటగాళ్లకు వార్నింగ్: పీఎస్ఎల్లో పాల్గొనేందుకు వస్తున్న విదేశీ ఆటగాళ్లు వెంటనే తమ నిర్ణయాన్ని మార్చుకుని వెనక్కి వెళ్లాలని, లేదంటే వారి భద్రతకు తాము బాధ్యత వహించబోమని ఉగ్ర సంస్థ పేర్కొంది.
- టార్గెట్లో స్టార్ ప్లేయర్లు: ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్తో పాటు మార్నస్ లబుషేన్, డారిల్ మిచెల్, ఆడమ్ జంపా వంటి ఆటగాళ్ల పేర్లను ప్రస్తావిస్తూ ఈ హెచ్చరికలు వెలువడ్డాయి.
- కారణం: దేశంలో అంతర్యుద్ధం, సైనిక అణచివేత జరుగుతున్న సమయంలో ఇలాంటి క్రికెట్ పండగలు నిర్వహించడం బాధితులను అవమానించడమేనని ఆ సంస్థ వ్యాఖ్యానించింది.
