
DSports 07Mar 2026:అహ్మదాబాద్: రేపు (మార్చి 8, ఆదివారం) న్యూజిలాండ్తో జరగబోయే హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్కు ముందు భారత క్రికెట్ జట్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్లో జట్టు బస చేసే హోటల్ను చివరి నిమిషంలో మార్చడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కేవలం హోటల్ మాత్రమే కాకుండా, స్టేడియంలోని డ్రెస్సింగ్ రూమ్ను కూడా మార్చాలని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు సమాచారం.
- గత చేదు జ్ఞాపకాలు: గతంలో టీమిండియా అహ్మదాబాద్ వచ్చినప్పుడు ‘ఐటీసీ నర్మద’ హోటల్లో బస చేసేది. అయితే, ఇదే హోటల్లో ఉన్నప్పుడు 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. అలాగే, ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లోనూ భారత్ ఇక్కడే ఉండి ఓటమిని చవిచూసింది.
- బ్యాడ్ లక్ భయం: ఈ రెండు కీలక ఓటముల నేపథ్యంలో ఆ హోటల్ తమకు కలిసిరావడం లేదని (బ్యాడ్ లక్), ఆ నెగటివ్ వైబ్స్ జట్టుపై పడకూడదని భావించిన బీసీసీఐ.. ఈసారి బసను ‘తాజ్ స్కైలైన్’ హోటల్కు మార్చింది.
- డ్రెస్సింగ్ రూమ్ మార్పు: సెంటిమెంట్ను ఎంతగా పాటిస్తున్నారంటే.. స్టేడియంలో సాధారణంగా భారత్ ఉపయోగించే ‘హోమ్’ డ్రెస్సింగ్ రూమ్ను కాదని, ఈసారి ‘విజిటర్స్’ (అతిథి జట్టు) డ్రెస్సింగ్ రూమ్ను వాడుకోవాలని నిర్ణయించారు.
అయితే, అధికారికంగా చూస్తే ఐసీసీ నిబంధనల ప్రకారం మొదట ఫైనల్కు క్వాలిఫై అయిన జట్టుకు (న్యూజిలాండ్) ఐటీసీ నర్మదను కేటాయించారు. దీంతో భారత్ మరో హోటల్ను ఎంచుకోవాల్సి వచ్చింది. ఇది యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ, భారత అభిమానులు మాత్రం దీనిని ‘లక్’ మార్చుకునే ప్రయత్నంగా చూస్తున్నారు.
