
DNews: Apr17: వ్యాపారవేత్త అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ మోసపూరిత ఖాతాల కేసులో చర్యలు తీసుకునేందుకు బాంబే హైకోర్టు ఇచ్చిన అనుమతిని సవాలు చేస్తూ అనిల్ అంబానీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంకులు తన, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఖాతాలను మోసపూరితమైనవిగా ప్రకటించడాన్ని అనిల్ అంబానీ మొదట బాంబే హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ముందు సవాలు చేశారు. దీంతో, హైకోర్టు వాటిపై స్టే విధించి, తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. మోసపూరిత ఖాతాలను గుర్తించడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను పాటించలేదని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయమై, మూడు బ్యాంకులు, ఆడిట్ సంస్థ బిడిఓ ఇండియా ఎల్ఎల్పి ఈ తీర్పుపై అప్పీల్కు వెళ్లాయి. దీంతో, డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఉత్తర్వును రద్దు చేసి, తదుపరి చర్యలకు అనుమతించింది. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు, కానీ అక్కడ కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది.
