
DSports 26Feb 2026: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా జరిగిన కీలక పోరులో శ్రీలంక ఘోర ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 61 పరుగుల తేడాతో ఓడిపోవడంతో, ఆతిథ్య జట్టు శ్రీలంక అధికారికంగా సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ ఫలితం పాకిస్థాన్ సెమీస్ ఆశలను కూడా క్లిష్టతరం చేస్తూ, దాదాపు ఇంటి బాట పట్టేలా చేసింది.
- టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. మిచెల్ శాంట్నర్ (47), రచిన్ రవీంద్ర (32) రాణించారు.169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక బ్యాటర్లు కివీస్ బౌలర్ల ధాటికి తలవంచారు. కేవలం 107 పరుగులకే ఆలౌట్ అయ్యారు. రచిన్ రవీంద్ర 4 వికెట్లతో లంక పతనాన్ని శాసించాడు.61 పరుగుల భారీ విజయం సాధించిన న్యూజిలాండ్, తన నెట్ రన్ రేట్ను +3.050 కు పెంచుకుని సెమీస్ దిశగా అడుగులేసింది.
- శ్రీలంక ఓటమితో పాకిస్థాన్ పరిస్థితి “అద్భుతం జరిగితే తప్ప సెమీస్ చేరలేదు” అన్నట్లుగా మారింది. సాంకేతికంగా పాక్ ఇంకా రేసులో ఉన్నప్పటికీ, అది చాలా కష్టమైన సమీకరణాలపై ఆధారపడి ఉంది ఫిబ్రవరి 27న ఇంగ్లాండ్తో జరగబోయే మ్యాచ్లో న్యూజిలాండ్ భారీ తేడాతో ఓడిపోవాలి.
పాక్ భారీ విజయం సాధించాలి: ఫిబ్రవరి 28న శ్రీలంకతో జరగబోయే మ్యాచ్లో పాకిస్థాన్ కనీసం 70-80 పరుగుల తేడాతో విజయం సాధించాలి.రన్ రేట్ కీలకం ఒకవేళ కివీస్ ఓడిపోయి, పాక్ గెలిస్తే.. ఇద్దరికీ 3 పాయింట్లు ఉంటాయి. అప్పుడు రన్ రేట్ చూస్తారు. ప్రస్తుతం కివీస్ రన్ రేట్ (+3.050) చాలా ఎక్కువగా ఉంది, పాక్ రన్ రేట్ (-0.461) చాలా తక్కువగా ఉంది.
ఇప్పటికే గ్రూప్-2 నుంచి ఇంగ్లాండ్ సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. రెండో స్థానం కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య పోటీ నెలకొంది.
