
DSports Jan05 2026: న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో నితీశ్ రెడ్డికి చోటు దక్కింది. అయితే, అద్భుతమైన ఫామ్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ను పక్కన పెట్టి నితీశ్ను తీసుకోవడంపై మాజీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.”జట్టులో ఇప్పటికే రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ వంటి ఆల్రౌండర్లు ఉన్నారు. మళ్ళీ నితీశ్ కుమార్ రెడ్డి ఎందుకు? అతడిని ఆల్రౌండర్ అంటున్నారు కానీ, బౌలింగ్లో ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. సెంచరీలతో ఫామ్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్కు అన్యాయం జరిగింది. ఈ ఎంపికలో అస్థిరత కనిపిస్తోంది.”
మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ సౌతాఫ్రికాపై సెంచరీ బాదడమే కాకుండా, ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కూడా సెంచరీలు, హాఫ్ సెంచరీలతో (సగటు 57+) భీకరమైన ఫామ్లో ఉన్నారు. అయినప్పటికీ అతడిని జట్టులోకి తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది.
