
DET:OCT 26:
సంగీత దంపతుల నూతన బంధం:
రఘు దీక్షిత్ మరియు వరిజాశ్రీ వేణుగోపాల్ పెళ్లి అక్టోబర్ 14,2025న జరిగినట్టుగా తెలుస్తోంది.వీరి వివాహం చాలా నిరాడంబరంగా, కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది.పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.రఘు దీక్షిత్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన భార్యతో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నారు.
సంతోషాన్ని పంచుకున్న రఘు దీక్షిత్:
సంతోషం మరియు కలిసి ఉండేందుకు!మా పెద్దల,కుటుంబ సభ్యుల మరియు శ్రేయోభిలాషుల దీవెనలతో ఈ కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్నందుకు కృతజ్ఞులం.లవ్ అండ్ లైట్ – వరి & రఘు అంటూ రఘు దీక్షిత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఈ పోస్ట్ ద్వారా తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు.
స్నేహమే ప్రేమగా మారింది:
రఘు దీక్షిత్,వరిజాశ్రీ ఇద్దరూ సంగీత ప్రపంచంలో చాలా సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నారు.వీరిద్దరూ చాలా పాటలకు కలిసి పనిచేశారు.వీరిద్దరి మధ్య ఉన్న బలమైన స్నేహం మెల్లగా ప్రేమగా మారి,చివరికి పెళ్లి బంధం వరకు దారితీసింది.ఇద్దరికీ సంగీతంపై ఒకే విధమైన ఆసక్తి ఉండటం,గాఢమైన అనుబంధం ఏర్పడటం ఈ బంధానికి బలం చేకూర్చింది.
పెళ్లి వేడుకలో సందడి:
వరిజాశ్రీ వేణుగోపాల్ గ్రామీ అవార్డుకు నామినేట్ అయిన ప్రతిభావంతురాలు.ఈ సంగీత కళాకారిణిని రఘు దీక్షిత్ పెళ్లాడటంపై వారి శ్రేయోభిలాషులు మరియు అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ వివాహ వేడుకకు నటి యమునా శ్రీనిధి,అయ్యో శ్రద్ధా వంటి పలువురు సినీ,సంగీత ప్రముఖులు హాజరయ్యారు.పెళ్లిలో వధువరులు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు.రఘు పసుపు రంగు అంచులతో ఉన్న తెల్లటి పంచెలో,వరిజాశ్రీ నారింజ రంగు చీరలో,సాంప్రదాయ ఆభరణాలతో చాలా అందంగా కనిపించారు.
గత వివాహ బంధం:
రఘు దీక్షిత్కు ఇది రెండో వివాహం.ఆయన ఇంతకుముందు కొరియోగ్రాఫర్,నర్తకి మయూరి ఉపాధ్యాయను 2005లో వివాహం చేసుకున్నారు.2016 నుండి విడిగా ఉండి,2019లో విడాకులు తీసుకున్నారు.ఆ తరువాత,రఘు దీక్షిత్ వరిజాశ్రీ రూపంలో మళ్లీ ప్రేమను కనుగొన్నారు.
