
DSports 26Feb 2026:హుబ్లీ వేదికగా కర్ణాటకతో జరుగుతున్న రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్ పోరులో జమ్మూకశ్మీర్ జట్టు చారిత్రక ప్రదర్శనతో ఆకట్టుకుంది. తన తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 584 పరుగుల భారీ స్కోరు సాధించి, ఫైనల్ మ్యాచ్పై పట్టు బిగించింది.
- టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న జమ్మూకశ్మీర్, బ్యాటర్ల సమిష్టి కృషితో పరుగుల వరద పారించింది. ఈ ఇన్నింగ్స్లో ఒక సెంచరీ మరియు ఐదు హాఫ్ సెంచరీలు నమోదు కావడం విశేషం.121 పరుగులతో అద్భుతమైన సెంచరీ సాధించి, రంజీ ఫైనల్లో శతకం బాదిన తొలి జమ్మూకశ్మీర్ ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. ఓపెనర్ యావర్ హసన్ (88), కెప్టెన్ పరాస్ డోగ్రా (70), కన్హయ్య వాధవన్ (70), సాహిల్ లోత్రా (72), మరియు అబ్దుల్ సమద్ (61) అర్ధ సెంచరీలతో కీలక సహకారం అందించారు. కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్లతో రాణించినప్పటికీ, జమ్మూకశ్మీర్ భారీ స్కోరు చేయడాన్ని ఆపలేకపోయాడు.
- 584 పరుగుల పర్వతాన్ని అధిగమించే క్రమంలో బరిలోకి దిగిన కర్ణాటకకు ఆదిలోనే షాక్ తగిలింది. జమ్మూకశ్మీర్ బౌలర్ అకిబ్ నబీ ధాటికి కర్ణాటక టాప్ ఆర్డర్ కుప్పకూలింది. స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ (13), దేవదత్ పడిక్కల్ (11), కరుణ్ నాయర్ (0) విఫలమయ్యారు. మయాంక్ అగర్వాల్ పోరాడుతున్నప్పటికీ, కర్ణాటక ప్రస్తుతం భారీ లోటులో ఉంది.ఒకవేళ ఈ ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిస్తే, రంజీ ట్రోఫీ విజేతను ‘ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్’ (తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం) ఆధారంగా ప్రకటిస్తారు.అంటే, కర్ణాటక తన మొదటి ఇన్నింగ్స్లో 584 పరుగుల కంటే ఎక్కువ స్కోరు చేస్తేనే విజేతగా నిలిచే అవకాశం ఉంటుంది.లేనిపక్షంలో, కర్ణాటకను అంతకంటే తక్కువ స్కోరుకే ఆలౌట్ చేస్తే జమ్మూకశ్మీర్ తన చరిత్రలో మొదటిసారి రంజీ ట్రోఫీని ముద్దాడుతుంది.జమ్మూకశ్మీర్ తన ప్రస్థానంలో తొలిసారి ఫైనల్ చేరడమే కాకుండా, ఇలాంటి భారీ స్కోరు సాధించడం పట్ల ఆ రాష్ట్ర క్రికెట్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
