
DNews:21 Nov:హైదరాబాద్, ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంపై కేటీఆర్ ఈరోజు (శుక్రవారం) స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ తన ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతిపై స్పందిస్తూ, “చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. చేసుకుపోనివ్వండి” అని వ్యాఖ్యానించారు. ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. అంతేకాక, ఈ మొత్తం వ్యవహారంపై అవసరమైతే లై డిటెక్టర్ టెస్ట్కు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రాష్ట్ర రాజకీయాలపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు.తెలంగాణలో ప్రస్తుతం ‘జాయింట్ వెంచర్ ప్రభుత్వం’ నడుస్తోందని విమర్శించారు.”తాము మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తామని.. అప్పుడు అన్ని లెక్కలు తేలుస్తామని” కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
