హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లోని శాసనసభా మందిరం నుంచి తెలంగాణ 3వ శాసనసభ 8వ సెషన్ 2వ సమావేశం 8వ రోజు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సమావేశాలు జరుగుతున్నాయి.
8వ రోజు సమావేశాలు ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో ప్రారంభమై అనంతరం సంతాప తీర్మానాలు, ముఖ్యమైన శాసన పత్రాలు, పరిపాలనా నివేదికల సమర్పణ వంటి కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రివర్గ సభ్యులు, ప్రతిపక్ష నేతలు సమావేశాల్లో పాల్గొంటున్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం భూసేకరణ సంక్షేమ పథకాల అమలు విద్యా మౌలిక వసతుల అభివృద్ధి రాబోయే శాసన తీర్మానాలు తదితర రాష్ట్ర ప్రాధాన్యత అంశాలపై సభ్యులు చర్చించనున్నారు.
