
DSports 02Feb 2026: త్వరలో ప్రారంభం కానున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్తో జరగాల్సిన హై-ప్రొఫైల్ మ్యాచ్ను తాము ఆడబోమని పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
- పాకిస్థాన్ ప్రభుత్వం ఆదివారం రాత్రి ఎక్స్ (X) వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది.”పాకిస్థాన్ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026లో పాల్గొనేందుకు ప్రభుత్వం అనుమతినిస్తోంది. అయితే, ఫిబ్రవరి 15న భారత్తో జరగాల్సిన మ్యాచ్లో మాత్రం పాక్ జట్టు పాల్గొనదు.”
- ప్రధాన కారణం: బంగ్లాదేశ్ జట్టు భద్రతా కారణాల దృష్ట్యా భారత్లో మ్యాచ్లు ఆడలేమని కోరగా, ఐసీసీ అందుకు నిరాకరించింది. దీనికి నిరసనగా బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోగా, వారి స్థానంలో స్కాట్లాండ్ను ఐసీసీ ఎంపిక చేసింది. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం “పక్షపాతంతో కూడుకున్నది” అని ఆరోపిస్తూ పాకిస్థాన్ ఈ బాయ్కాట్ నిర్ణయాన్ని తీసుకుంది.
