
DSports 26 Nov:లక్నో వేదికగా జరుగుతున్న సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగిన భారత మహిళల డబుల్స్ జోడీ గాయత్రీ గోపీచంద్ మరియు ట్రీసా జాలీ శుభారంభం చేశారు. ఈ టోర్నమెంట్లో నం.1 సీడ్స్గా ఉన్న ఈ యువ ద్వయం, తొలి రౌండ్లో మలేషియాకు చెందిన చెంగ్ సూ హుయ్ మరియు టాన్ జింగ్ యీ జోడీని ఓడించి రెండవ రౌండ్లోకి దూసుకెళ్లింది.
తొలి గేమ్ స్లోగా ప్రారంభించిన గాయత్రీ-ట్రీసా జోడీ 19-21తో ఆ గేమ్ కోల్పోయినప్పటికీ, ఆ తర్వాత పుంజుకుని 22-20, 21-9 తేడాతో తర్వాతి రెండు గేమ్స్ గెలిచి, అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించింది. గత సీజన్లో ఈ టైటిల్ను గెలుచుకున్న గాయత్రీ-ట్రీసా జోడీ, ఈసారి కూడా టైటిల్ను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉండగా, వారి ఆరంభ విజయం భారత అభిమానులకు ఆశలు పెంచింది.
