
DSports 30Oct; ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన ఆరోగ్య పరిస్థితిపై తొలిసారిగా స్పందించారు. తన శ్రేయోభిలాషులు మరియు అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ శ్రేయస్ సోషల్ మీడియా వేదికగా సందేశాన్ని పంపారు.
“ప్రస్తుతం నేను కోలుకుంటున్న దశలో ఉన్నాను. ప్రతి రోజు నా ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఈ కష్ట సమయంలో నాకు అండగా నిలిచి, శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.”
…అని పేర్కొన్నారు. శ్రేయస్ స్వయంగా స్పందించడంతో అతడి అభిమానులు, క్రికెట్ ప్రేమికులు ఊపిరి పీల్చుకున్నారు.
