
DSport Dec26 2025:జైపూర్: సుదీర్ఘ విరామం తర్వాత దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగిన టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ, తన ఆటతోనే కాకుండా తన రియాక్షన్తోనూ వార్తల్లో నిలిచారు. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ముంబై, సిక్కిం జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఒక సరదా సంఘటన చోటుచేసుకుంది.
రోహిత్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా, గ్యాలరీలోని ఓ అభిమాని గట్టిగా “రోహిత్ భాయ్.. వడాపావ్ తింటావా?” అని అడిగాడు. సాధారణంగా రోహిత్ను సోషల్ మీడియాలో ‘వడాపావ్’ అంటూ ట్రోల్ చేస్తుంటారు. అయితే, రోహిత్ దీనిని చాలా స్పోర్టివ్గా తీసుకుని, నవ్వుతూ “వద్దు” అన్నట్టుగా చేతితో సైగ చేశాడు. రోహిత్ ఇచ్చిన ఈ ఫన్నీ రియాక్షన్కు స్టేడియం మొత్తం కేకలతో దద్దరిల్లిపోయింది.
