
DSports 25 Nov: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మైదానంలోకి దిగితే ఏదో ఒక రికార్డు సృష్టించకుండా వెనుదిరగడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో, నాల్గవ రోజు ఆటలో తన అద్భుత ప్రదర్శనతో భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో జడేజా 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ 3 వికెట్లతో కలిపి…టెస్ట్ క్రికెట్లో 300 వికెట్లు మరియు 3000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో భారత క్రికెటర్గా జడేజా నిలిచాడు.కపిల్ దేవ్ తర్వాత ఈ అరుదైన ‘డబుల్’ ఘనత సాధించిన భారత క్రికెటర్ జడేజా మాత్రమే.
ఈ రికార్డును కేవలం 68 టెస్ట్ మ్యాచ్ల్లో పూర్తి చేసి, అతి తక్కువ మ్యాచ్ల్లో ఈ ఫీట్ సాధించిన ప్రపంచ రికార్డుకు దగ్గరగా నిలిచాడు.
