
DSports 6Dec:విశాఖపట్నం: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ఉత్కంఠభరితమైన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో సిరీస్ విజేత ఎవరో నేడు తేలనుంది. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉండగా, విశాఖపట్నంలోని డా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో డిసెంబర్ 6, శనివారం జరిగే మూడో వన్డే మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది.
టీమిండియా బ్యాటింగ్ లైనప్ అద్భుతమైన ఫామ్లో ఉంది. విరాట్ కోహ్లీ వరుసగా రెండు సెంచరీలు చేయగా, రుతురాజ్ గైక్వాడ్, కెప్టెన్ కేఎల్ రాహుల్లు కూడా కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అయితే, బౌలర్ల పేలవ ప్రదర్శన జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. గత రెండు వన్డేల్లోనూ భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ నిర్ణయాత్మక పోరులో బౌలింగ్ విభాగం ఎలా రాణిస్తుందో చూడాలి.విశాఖపట్నం మైదానం విరాట్ కోహ్లీకి బాగా కలిసొచ్చిన వేదిక. ఇక్కడ ఆడిన 7 వన్డేల్లో అతను 97.83 సగటుతో 587 పరుగులు చేశాడు, అందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఈ ఫామ్ను కొనసాగించి, జట్టుకు సిరీస్ విజయాన్ని అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.
