
DSports Dec16 2025: పీఎల్ 2026 మినీ వేలానికి సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక కీలకమైన కొత్త నిబంధనను (నయా రూల్) తీసుకువచ్చింది. ఇది ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లకు సంబంధించినది. ఇకపై మినీ వేలంలో ఒక విదేశీ ఆటగాడికి ఎంత ధర పలికినా, సదరు ఆటగాడికి చెల్లించే గరిష్ట వేతనం కేవలం ₹18 కోట్లుగా మాత్రమే పరిమితం చేయబడుతుంది.
కొన్ని ఫ్రాంచైజీలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, ముఖ్యంగా కొంతమంది విదేశీ ఆటగాళ్లు మెగా వేలాన్ని నివారించి, మినీ వేలంలో అధిక ధర పలికే వ్యూహాన్ని అడ్డుకోవడానికి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.వేలంలో ఆటగాడిపై బిడ్డింగ్ ద్వారా ధర ₹18 కోట్లకు మించినా, అతనికి ఇచ్చే చెల్లింపు మాత్రం ₹18 కోట్లకు మాత్రమే పరిమితం అవుతుంది. అంతకుమించి అదనంగా వచ్చే మొత్తం బీసీసీఐకి వెళ్తుంది.
ఒకే ఆటగాడి కోసం రెండు లేదా అంతకంటే ఎక్కువ జట్లు సమానమైన బిడ్ వద్ద నిలిచిపోయినప్పుడు (టై అయినప్పుడు) ‘టై-బ్రేకర్’ రూల్ అమలు చేయబడుతుంది. దీని ప్రకారం, జట్లు రహస్యంగా మరో బిడ్ను సమర్పించాల్సి ఉంటుంది. అత్యధిక బిడ్ వేసిన జట్టు ఆటగాడిని దక్కించుకుంటుంది, కానీ ఆటగాడికి చెల్లించే మొత్తం మాత్రం ‘టై’ అయిన చివరి ధర మాత్రమే అవుతుంది.
ఈ కొత్త నిబంధనలు ఫ్రాంచైజీలు తమ వేల వ్యూహాలను మరింత పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరాన్ని పెంచాయి.
