
DNews: Apr29: కొత్త టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. మంగళగిరిలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ కేంద్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యవర్గ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. పొలిట్బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలకు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. పార్టీ నాయకత్వం పాత, కొత్త నాయకుల కలయికతో ఈ కమిటీలను ఏర్పాటు చేసింది. పార్టీ చరిత్రలో తొలిసారిగా మండల, క్లస్టర్ స్థాయి నాయకులకు పొలిట్బ్యూరోలో స్థానం లభించింది.
