
DSports Dec17 2025: అబుదాబిలో జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలం తర్వాత జియో సినిమా (JioHotstar) చర్చా కార్యక్రమంలో పాల్గొన్న రాబిన్ ఉతప్ప, ధోనీ భవిష్యత్తుపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. చెన్నై జట్టు మునుపటిలా కాకుండా ఈసారి యువ ఆటగాళ్లపై భారీగా పెట్టుబడి పెట్టడం వెనుక ఉన్న అంతరార్థం ఇదేనని ఆయన చెప్పుకొచ్చారు.
“గోడ మీద రాత స్పష్టంగా కనిపిస్తోంది. ఐపీఎల్ 2026 ఖచ్చితంగా ధోనీకి చివరి సీజన్ అవుతుంది. ఇకపై అతను ఆడతాడా లేదా అనే ఊహాగానాలకు తావు లేదు” అని ఉతప్ప పేర్కొన్నారు. సీఎస్కే వేలంలో కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ వంటి యువ అన్క్యాప్డ్ ప్లేయర్ల కోసం రూ. 28 కోట్లకు పైగా ఖర్చు చేయడం, భవిష్యత్తు అవసరాల కోసమేనని ఆయన విశ్లేషించారు. ఈ సీజన్లో ధోనీ కేవలం ఆటగాడిగానే కాకుండా, తదుపరి తరం ఆటగాళ్లను సిద్ధం చేసే మెంటార్ పాత్రలో కూడా కనిపిస్తారని ఉతప్ప అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ నుంచి సంజూ శాంసన్ను ట్రేడ్ ద్వారా తీసుకోవడం కూడా ధోనీ తర్వాతి వారసుడి వేటలో భాగమేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. 2020లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోనీ, ప్రస్తుతం 44 ఏళ్ల వయసులో కూడా ఐపీఎల్లో కొనసాగుతున్నారు. గత ఐదు సీజన్లుగా ఆయన రిటైర్మెంట్పై చర్చ జరుగుతున్నా, అభిమానుల కోసం ఆయన మైదానంలోకి వస్తూనే ఉన్నారు.అయితే, సీఎస్కే మేనేజ్మెంట్ గానీ, ధోనీ గానీ దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
