DTelangana 08 May: సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో గురువారం తెల్లవారుజామున ఒక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన ఒక డీసీఎం వ్యాన్ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుస్నాబాద్ నుంచి మామిడి కాయల లోడుతో ఒక డీసీఎం వ్యాన్ కరీంనగర్ మీదుగా పశ్చిమ బెంగాల్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో కోహెడ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామ శివారులోకి రాగానే వాహనం ఒక్కసారిగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన బోల్తా పడింది.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.

ముఖ్య గమనిక: తెల్లవారుజామున నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

By Adhitya

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana