DTelangana 08 May: సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో గురువారం తెల్లవారుజామున ఒక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన ఒక డీసీఎం వ్యాన్ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుస్నాబాద్ నుంచి మామిడి కాయల లోడుతో ఒక డీసీఎం వ్యాన్ కరీంనగర్ మీదుగా పశ్చిమ బెంగాల్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో కోహెడ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామ శివారులోకి రాగానే వాహనం ఒక్కసారిగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన బోల్తా పడింది.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.

ముఖ్య గమనిక: తెల్లవారుజామున నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

By Adhitya

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana