
DSports 03 Dec:న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల గురించి అఫ్గానిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ రహమానుల్లా గుర్బాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారాయి. 2027 వన్డే ప్రపంచకప్లో ఈ ఇద్దరు ఆటగాళ్లు టీమిండియా జట్టులో ఉండకపోతే, అఫ్గానిస్తాన్తో సహా ప్రత్యర్థి జట్లన్నీ చాలా సంతోషిస్తాయని గుర్బాజ్ సరదాగా వ్యాఖ్యానించారు.
