
DSports 16Mar 2026:వాస్తవానికి, 2025లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ రోహిత్ శర్మ సారథ్యంలో గెలుచుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి భారత్ ట్రోఫీని ముద్దాడింది. అప్పట్లో గిల్ కేవలం ఆటగాడిగా మాత్రమే ఉన్నాడు.
- బీసీసీఐపై విమర్శలు: రోహిత్ నాయకత్వంలో సాధించిన విజయాన్ని మరొకరి ఖాతాలో ఎలా వేస్తారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. “బీసీసీఐకి కనీస స్పృహ లేదా? చరిత్రను తిరగరాయాలని ప్రయత్నించకండి” అంటూ నెటిజన్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మండిపడుతున్నారు.
- గౌరవం ఇవ్వరా?: గతేడాది టెస్టుల నుంచి రిటైర్ అయినప్పటికీ, వన్డేల్లో రోహిత్ ఇంకా కొనసాగుతున్నాడని, అలాంటి దిగ్గజ కెప్టెన్కు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
