
DSports:Sep23: భారత ఫుట్బాల్ జట్టు ఇటీవల పలు టోర్నమెంట్లలో మెరుగైన ప్రదర్శన కనబరిచి వార్తల్లో నిలిచింది. పురుషుల మరియు మహిళల అండర్-17 జట్లు సాధించిన కొన్ని కీలక విజయాలు అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తించాయి.
భారత U17 పురుషుల జట్టు సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ U-17 ఛాంపియన్షిప్లో గత కొన్ని సంవత్సరాలుగా ఆధిపత్యం చూపుతోంది. ఈ టోర్నమెంట్లో గత నాలుగు ఎడిషన్లలోనూ (2019, 2022, 2023, 2024) ఛాంపియన్ గా నిలిచి వరుస విజయాలను నమోదు చేసింది.
ఈ ఛాంపియన్షిప్లో భాగంగా భారతదేశం U17 జట్టు సెప్టెంబర్ 22, 2025న పాకిస్థాన్ U17 జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధించి తమ విజయ పరంపరను కొనసాగించాలని జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.
యువ ఆటగాళ్లకు అనుభవం కల్పించేందుకు భారత U-17 జట్టు యూరప్ టూర్ లో భాగంగా జర్మనీలోని కొన్ని ప్రముఖ క్లబ్ లతో స్నేహపూర్వక మ్యాచ్ లు ఆడింది. ఈ మ్యాచ్ లలో స్టట్గార్ట్ మరియు ఆగ్ బర్గ్ జట్ల పై గెలిచి తమ సత్తా చాటారు.ఈ టోర్నమెంట్లో సాధించిన విజయం, AFC U17 మహిళల ఆసియా కప్ క్వాలిఫయర్స్ లో జట్టుకు మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.
ఈ విజయాలు భారత ఫుట్బాల్ భవిష్యత్తుపై ఆశలు పెంచుతున్నాయి. యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఆడే అవకాశం కల్పించడం ద్వారా వారి నైపుణ్యాలు మెరుగుపడతాయని ఫుట్ బాల్ నిపుణులు భావిస్తున్నారు. ఈ విజయ పరంపరను కొనసాగిస్తూ, అంతర్జాతీయ వేదికలపై భారత జట్లు మరింత గొప్ప విజయాలను సాధిస్తాయని ఆశిద్దాం.
