
DNews: Nov 20: చెవెళ్ల: రంగారెడ్డి జిల్లాలోని చెవెళ్లలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మరియు బీజేపీ నేత రత్నం మాట్లాడుతూ, రెండు సంవత్సరాల క్రితం చెవెళ్లలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రూ.17.50 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. అయితే ఇప్పటికీ ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ దీక్షలో నాయకులు కంచర్ల ప్రకాష్, ప్రభాకర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, డాక్టర్ వైభవ్ రెడ్డి, పండురంగ రెడ్డి, మిట్ట వెంకట రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్య హక్కుల కోసం ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని వారు తెలిపారు.
