
D News: కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్హౌస్ వైపు వెళ్తున్న కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్ను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని దామరకుంట వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం.
దామరకుంట వద్ద ఇరువర్గాల ఘర్షణ
కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్ను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరుపార్టీల కార్యకర్తలు ముఖాముఖి ఎదురుపడ్డారు. దీంతో అక్కడ తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కాంగ్రెస్ వాహనాలపై రాళ్ల దాడి
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ నాయకుల వాహన శ్రేణిపై రాళ్లు రువ్వినట్లు కాంగ్రెస్ వర్గాలు ఆరోపించాయి. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమైనట్లు సమాచారం.
రాకపోకలకు అంతరాయం
ఇరువర్గాల మధ్య ఘర్షణతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. దామరకుంట పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అదనపు పోలీసు బలగాల మోహరింపు
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. అదనపు పోలీసు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.
