
DSports 29 Nov:లక్నో: ముంబై యువ ఓపెనర్ ఆయుష్ మాత్రే (Ayush Mhatre) సంచలనం సృష్టించాడు. కేవలం 18 ఏళ్ల వయసులోనే దేశవాళీ క్రికెట్లో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ పేరిట 19 ఏళ్లుగా ఉన్న ఒక వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో భాగంగా శుక్రవారం విదర్భతో జరిగిన మ్యాచ్లో ఆయుష్ మాత్రే విధ్వంసకర శతకంతో చెలరేగి ముంబైకి విజయాన్ని అందించాడు.శుక్రవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో విదర్భ నిర్దేశించిన 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై జట్టు ఛేదించింది.ఆయుష్ మాత్రే ప్రదర్శన ఓపెనర్గా బరిలోకి దిగిన ఆయుష్ కేవలం 53 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో నాటౌట్గా 110 పరుగులు చేశాడు.ఈ విధ్వంసక ఇన్నింగ్స్తో ముంబై జట్టు 17.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున కూడా ఆడుతున్న ఈ యువ బ్యాటర్, తన అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా భవిష్యత్తు స్టార్గా తన పేరును బలంగా వినిపించుకున్నాడు.
