
DNews: Apr 21: జగిత్యాల: రాష్ట్ర రాజకీయాలపై బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శిస్తూ, ఆయన రాష్ట్రానికి శని గ్రహంలా మారారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మరో రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతారా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా మార్పులు సంభవించవచ్చని, రాజకీయ పరిణామాలు ఊహించని విధంగా మలుపులు తిరగవచ్చని అభిప్రాయపడ్డారు.
రేవంత్ రెడ్డి బీజేపీతో సమావేశమవడం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై విశ్వాసం లేకపోవడం పట్ల జీవన్ రెడ్డి విమర్శలు చేశారు. ఆయన స్వంత పార్టీని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారని ఆరోపించారు. తన రాజకీయ ప్రయాణంపై స్పందిస్తూ, జీవన్ రెడ్డి ఎప్పుడూ తన సామర్థ్యంతోనే అవకాశాలు పొందానని, ఎవరినీ తొక్కి రాజకీయాల్లోకి ప్రవేశించలేదని స్పష్టం చేశారు.
