
DNews: Apr21: ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన స్థానిక కేడర్ నిబంధనలను ఏపీ ప్రభుత్వం సవరించింది. గత ఏడాది జారీ చేసిన ఉత్తర్వులకు సవరణలు చేస్తూ ఈ కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. దీని ప్రకారం, రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా, మల్టీజోన్లుగా విభజించారు. నియామకాలలో పారదర్శకత, స్థానికులకు ప్రాధాన్యత కల్పించే లక్ష్యంతో ఈ కొత్త కేడర్ విధానాన్ని అమలు చేశారు.ఈ కొత్త నిబంధనల ప్రకారం, 95 శాతం ఉద్యోగాలను స్థానిక అభ్యర్థులకే కేటాయిస్తారు. మిగిలిన 5 శాతం పోస్టులు మాత్రమే ఓపెన్ కోటా (ఇతరుల కోసం) కింద అందుబాటులో ఉంటాయి. అభ్యర్థి నివసించిన లేదా చదువుకున్న వరుసగా నాలుగు సంవత్సరాల ఆధారంగా వారి నివాస ప్రాంతాన్ని నిర్ధారిస్తారు. ఈ మార్పుల వల్ల ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానిక యువతకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి.
