
D Spiritual: Apr 29: వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన ఘట్టం. అయితే నేటి కాలంలో కెరీర్పై దృష్టి పెట్టడం లేదా జాతకంలోని కొన్ని దోషాల కారణంగా పెళ్లిళ్లు ఆలస్యమవుతున్నాయి. 30 ఏళ్లు దాటినా సంబంధాలు కుదరక మానసిక ఒత్తిడికి గురవుతున్నవారు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని శక్తివంతమైన దేవాలయాలను దర్శిస్తే శుభ ఫలితాలు ఉంటాయని భక్తులు నమ్ముతారు. వివాహ అడ్డంకులను తొలగించి త్వరగా పెళ్లి అయ్యేలా చేసే ప్రసిద్ధ క్షేత్రాల వివరాలు ఇవి.
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంను దర్శించి స్వామివారికి కళ్యాణోత్సవం చేయిస్తే వివాహ గడియలు త్వరగా వస్తాయని భక్తుల విశ్వాసం. అలాగే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి ఆలయం రాహు–కేతు దోష నివారణకు ప్రసిద్ధి. జాతకంలో సర్పదోషం లేదా కుజదోషం కారణంగా వివాహం ఆలస్యమైతే ఇక్కడ ప్రత్యేక పూజలు చేయిస్తే అడ్డంకులు తొలగుతాయని నమ్ముతారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కోడె మొక్కు చెల్లించుకుంటే శివుని అనుగ్రహంతో పెళ్లి సంబంధాలు త్వరగా కుదురుతాయని చెబుతారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల దేవస్థానం (చిన్న తిరుపతి) కూడా వివాహ సంబంధాలకు ప్రసిద్ధి. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి కళ్యాణం జరిపిస్తే త్వరలోనే సంబంధం నిశ్చయమవుతుందని భక్తుల అనుభవం.
కర్నూలు జిల్లాలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకుంటే వైవాహిక అడ్డంకులు తొలగుతాయని విశ్వాసం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని కంచుకోట వేణుగోపాల స్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణం దర్శించుకోవడం లేదా అభిషేకం చేయించడం వల్ల త్వరగా వివాహం జరుగుతుందని చెబుతారు.
ఈ పుణ్యక్షేత్రాల దర్శనం ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించడమే కాకుండా, వివాహ శుభకార్యానికి నాంది పలుకుతుందని భక్తులు నమ్ముతారు. నమ్మకంతో చేసే ప్రార్థనలు, పవిత్ర క్షేత్రాల సందర్శనం సానుకూల ఫలితాలను ఇస్తాయని విశ్వాసం. జాతక దోషాలను అధిగమించడానికి తెలుగు రాష్ట్రాల్లోని ఈ క్షేత్రాల దర్శనం ఒక చక్కని మార్గంగా భావిస్తారు.
