D News: Jul 9: మహిళా సంఘాలకు మరో శుభవార్త.. ఎరువుల పంపిణీ బాధ్యతలు అప్పగించనున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు ఫెర్టిలైజర్ లైసెన్సులు మంజూరు చేసి, రైతులకు ఎరువులు సరఫరా చేసే బాధ్యతలను అప్పగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చురుగ్గా పనిచేస్తున్న మహిళా సంఘాలను గుర్తించి, ఎంపికైన సంఘాలకు ఎరువుల విక్రయానికి అవసరమైన లైసెన్సులు అందించనుంది. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు గ్రామీణ స్థాయిలో వ్యవసాయ సేవలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుతం తెలంగాణలో సుమారు 4.67 లక్షల మహిళా సంఘాలు ఉన్నాయి. వీటిలో ఆసక్తి, సామర్థ్యం కలిగిన సంఘాలను ఎంపిక చేసి ఫెర్టిలైజర్ లైసెన్సులు జారీ చేయనున్నారు. అలాగే యూరియా యాప్ వినియోగంపై ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు. మహిళా సంఘాల కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 8,126 సొంత భవనాలను నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఈ భవనాల్లోనే ఎరువులను నిల్వ చేసుకునేలా అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో ప్రతి ఏడాది సుమారు 40 లక్షల టన్నుల ఎరువులు రైతులకు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం రైతులు వ్యవసాయ సహకార సంఘాలు, ప్రైవేట్ ఎరువుల దుకాణాల ద్వారా ఎరువులను కొనుగోలు చేస్తున్నారు. ఇకపై మహిళా సంఘాలకు కూడా ఈ బాధ్యతలను అప్పగించడం ద్వారా రైతులు తమ గ్రామాల్లోనే సులభంగా ఎరువులు కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది. దీంతో ఎరువుల కోసం పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు రైతుల సమయం, రవాణా ఖర్చులు కూడా ఆదా కానున్నాయి.

ప్రతి గ్రామంలో ఐదు నుంచి పది వరకు మహిళా సంఘాలు ఉండగా, వాటిలో ఆసక్తి ఉన్న సంఘాలను అధికారులు ఎంపిక చేయనున్నారు. ఎంపికైన సంఘాలకు ఎరువుల విక్రయ బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ కార్యక్రమం వల్ల రైతులకు సకాలంలో ఎరువులు అందుబాటులోకి రావడమే కాకుండా, మహిళా సంఘాలకు అదనపు ఆదాయ వనరు కూడా ఏర్పడనుంది. ఈ ప్రణాళిక అమలుపై ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు, పేదరిక నిర్మూలన సంస్థ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. మొదటి దశలో కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి, అక్కడి ఫలితాలు, ఫీడ్‌బ్యాక్ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు సమాచారం.

ఇప్పటికే ప్రభుత్వం రైతు వేదికల ద్వారా విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అయితే అనేక రైతు వేదికల్లో సరైన మౌలిక వసతులు లేకపోవడం, విత్తనాల నిల్వకు గిడ్డంగులు అందుబాటులో లేకపోవడంతో ప్రత్యామ్నాయ వ్యవస్థలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మహిళా సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ చేపట్టే కొత్త విధానం రైతులకు మరింత సౌకర్యవంతంగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana