
DNews: Feb 25: హైదరాబాద్లో అడోబ్ సీఈఓ మరియు తెలంగాణ రైజింగ్-2047 విజన్ బోర్డు సభ్యుడు శాంతను నారాయణ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో బుధవారం కలిశారు. ఈ సమావేశంలో గ్లోబల్ ట్రెండ్స్, అవకాశాలు, గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం, ఉద్యోగాలపై దాని ప్రభావం, స్కిల్లింగ్ మరియు రీ-స్కిల్లింగ్ వంటి అంశాలపై చర్చ జరిగింది. తెలంగాణను మాన్యుఫాక్చరింగ్ పవర్గా మార్చాల్సిన అవసరం ఉందని, ముఖ్యమైన కంపెనీలను ఆకర్షించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావం, భవిష్యత్తులో దాని సమర్థవంతమైన వినియోగంపై కూడా ఆయన శాంతను నారాయణ్తో చర్చించారు. తెలంగాణ అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లేందుకు శాంతను నారాయణ్ మరింత సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
