
DNews: Apr16: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 62 గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. పేదలకు భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ధర్మవరం నియోజకవర్గం పెదకూరపాడులో అన్న క్యాంటీన్ను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుశం జిల్లా టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రుచి, పరిశుభ్రత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అన్న క్యాంటీన్లను ఎమ్మెల్యే కళావెంకట్ రావు, ఏలూరు జిల్లా కైకలూరులో అన్న క్యాంటీన్లను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు ప్రారంభించారు.
