
DNews: Mar14: ఉగాది నాడు నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం బహుమతి ఇవ్వనుంది. నూతన సంవత్సర దినోత్సవం నాడు 60 విభాగాల్లో 10,000 పోస్టుల భర్తీకి సంబంధించిన ఉద్యోగ క్యాలెండర్ను ప్రకటిస్తారు. ఆర్థిక శాఖ ఆమోదం పొందిన తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆయా విభాగాల్లో ఖాళీల భర్తీకి శుక్రవారం ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించింది. కొన్ని పోస్టులు ఇప్పటికే ఆమోదం పొందగా, మరికొన్ని శాఖ పరిశీలనలో ఉన్నాయి. ఉద్యోగ క్యాలెండర్లో ఎన్ని పోస్టులు ఉంటాయో రెండు, మూడు రోజుల్లో స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటివరకు 470 గ్రూప్-2 పోస్టులు, 101 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ఏడాది మెగా డీఎస్సీ ద్వారా ప్రభుత్వం 16,000 పోస్టులను భర్తీ చేసింది. ఈ ఏడాది ఉద్యోగ క్యాలెండర్లో మరో మూడు వేలకు పైగా పోస్టులను ప్రకటించనున్నారు. చాలా కాలంగా విశ్వవిద్యాలయాల్లో పెండింగ్లో ఉన్న బోధనా సిబ్బంది పోస్టుల్లో 1,500 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశ్వవిద్యాలయాల్లో మూడు వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వివిధ చట్టపరమైన వివాదాల కారణంగా ఈ పోస్టులు చాలా కాలంగా భర్తీ కాలేదు. గత ప్రభుత్వ హయాంలో వాటి భర్తీ ప్రక్రియను హడావిడిగా ప్రారంభించినప్పటికీ, రోస్టర్ లోపాల కారణంగా అది మధ్యలో ఆగిపోయింది. ఈ నేపథ్యంలో, చట్టపరమైన వివాదాలను పరిష్కరించి, ముందుగా 1,500 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక నుంచి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఆ పోస్టులను కూడా ఉద్యోగ క్యాలెండర్లోకి తీసుకువస్తోంది.
