
DNews: Mar14: ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున, మంత్రులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. అమరావతిలో జరిగిన సమావేశంలో ఈ విషయంపై మంత్రులతో సీఎం చర్చించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా వివరించడంలో మనం వెనుకబడ్డామని ఆయన అన్నారు. ప్రజల మధ్య ఎక్కువగా ప్రయాణించి ప్రభుత్వ పనుల గురించి వారికి తెలియజేయాలని, క్షేత్ర పర్యటనలు పెంచాలని మంత్రులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుని శాఖలపై మరింత నియంత్రణ సాధించాలని కూడా ఆయన ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడం ద్వారా ఎన్నికలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులకు సూచించినట్లు సమాచారం.
