
DNews: Mar07: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ జీతం ప్యాకేజీ గణనీయంగా పెరిగింది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ రాబోయే మూడేళ్లకు ఈ మొత్తాన్ని $692 మిలియన్లకు పెంచాలని నిర్ణయించింది. అంటే, భారతీయ కరెన్సీలో అక్షరాలా రూ. 6,361 కోట్లు. ఇది ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ద్వారా వెల్లడైంది.
ఈ జీతం ప్యాకేజీలో వార్షిక జీతం $2 మిలియన్లు కాగా.. పెర్ఫార్మెన్స్ స్టాక్ యూనిట్ (PSU) విలువ $126 మిలియన్లుగా నిర్ణయించబడింది. ఈ మొత్తాన్ని కంపెనీ నిర్దేశించిన లక్ష్యాల సాధన ఆధారంగా సర్దుబాటు చేస్తారు. $84 మిలియన్లు పరిమితం చేయబడిన స్టాక్ వెస్టింగ్ ద్వారా అందుతాయి. పరిమితం చేయబడిన స్టాక్ వెస్టింగ్ అంటే.. కంపెనీ ఉద్యోగికి మంజూరు చేసే షేర్లు. ఇవి ఉద్యోగికి పదవీకాలం లేదా పనితీరు పూర్తయిన తర్వాత బదిలీ చేయబడతాయి. అలాగే, ఆల్ఫాబెట్ అనుబంధ సంస్థలైన వ్యోమో మరియు వింగ్ ఏవియేషన్లో $175 మిలియన్ల విలువైన షేర్లను కేటాయించారు. ఈ రెండు కంపెనీల నాయకత్వంపై సుందర్ పిచాయ్ విశ్వాసానికి ఈ ప్రోత్సాహకాలు నిదర్శనమని ఆల్ఫాబెట్ బోర్డు వెల్లడించింది. టెక్ ప్రపంచం AI తో వేగంగా మారుతున్న తరుణంలో పిచాయ్ పై బలమైన నమ్మకంతో కంపెనీ ఈ వేతన పెంపును ప్రకటించింది.
