
DNews: Mar07: కూటమి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతూ ఏపీ అసెంబ్లీలో సమయం వృధా చేస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వ లెక్కలు వాస్తవాలకు సంబంధం లేదని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ నాయకులు సూపర్ సిక్స్ను అమలు చేయకుండా సూపర్ స్కామ్కు పాల్పడుతున్నారని చంద్రశేఖర్ విమర్శించారు. వైఎస్ జగన్ను విమర్శించడానికి, లడ్డూ ప్రసాదంపై విషం చిమ్మడానికి అసెంబ్లీ ప్రాధాన్యత ఇచ్చింది. మండలి ఛైర్మన్ను మతం పేరుతో అవమానించారు. లడ్డూపై చర్చ జరిగితే తమ పాపాలు బయటపడతాయని వారు భయపడ్డారు. అందుకే వారు చైర్మన్కు మతాన్ని ఆపాదించారు. మంత్రులు కామెడీ చేస్తుండగా, కామెడీ కళాకారులు మంత్రుల మాదిరిగా మాట్లాడుతున్నారు. ఉద్యోగాల కల్పనలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్రాన్ని దిగజార్చిన చంద్రబాబు ఇప్పుడు దేశ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారట . ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంపై కాగ్ దానిని కడిగిపారేసింది. ఉద్యోగాల క్యాలెండర్ అడిగినప్పుడు, లోకేష్ తేదీలను మారుస్తూనే ఉన్నారు. వారు దోచుకుంటున్నారు అడిగితె లాఠీ లతో బెదిరిస్తున్నారు అని ఆయన విమర్శించారు.
