
DSports 20Feb 2026:కొలంబో: క్రికెట్ ప్రపంచంలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పోరు అంటేనే ఒక యుద్ధంలా భావిస్తారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే టీమిండియా పాకిస్థాన్ను అసలు ఒక ప్రత్యర్థి జట్టుగా కూడా గుర్తించడం లేదని పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో భారత్ చేతిలో పాకిస్థాన్ 61 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
- ఒక ఇంటర్వ్యూలో ఆమిర్ మాట్లాడుతూ.. భారత్ ఇప్పుడు పాక్ను సీరియస్గా తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.”1990వ దశకంలో భారత జట్టుకు పాకిస్థాన్పై ఓడిపోతామనే భయం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. టీమిండియా మిమ్మల్ని అసలు సీరియస్గా తీసుకోవడం లేదు. పాక్ ఎలాగైనా ఓడిపోతుందనే ముద్ర వారి మనసుల్లో బలంగా పడిపోయింది. అందుకే మా వికెట్లు పడినా వారు పెద్దగా సంబరాలు చేసుకోవడం లేదు. మాపై గెలిచినా అది ఒక రొటీన్ విషయంలా చూస్తున్నారు” అని ఆమిర్ పేర్కొన్నారు
